హిందుత్వం నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్న పార్టీ - A Political party working towards annihilation to Hindutva - Hindus

0
హెందుత్వం - హిందువుల నిర్మూలనే లక్ష్యంగా పని చేసిన-చేస్తున్న పార్తీ - A Political party working towards annihilation to Hindutva - Hindus
Anti-Hindu propaganda

హిందుత్వ నిర్మూలనే లక్ష్యంగా పనిచేసిన రాజకీయ పార్టీ

_ ఆకారపు కేశవరాజు, 
విశ్వహిందూపరిషత్‌ బీహార్‌, రూర్ధండ్‌ రాష్ట్రాల సంఘటనా మంత్రి.

ఇటీవల జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలలో వేలాది మంది ప్రజలు పాల్గొన్న ఒక నభలో ముఖ్యవక్త  ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ “భారతదేశం హిందువులదే తప్ప హిందూత్వవాదులది కాదు” అని ప్రకటించాడు, అంతేకాదు 'భారతదేశ రాజ్యాధికారం హిందువులకే దక్కాలి, కానీ హిందుత్వ వాదులకు కాదు, నేను హిందువును, 'హిందుత్వవాదిని కాను అంటూ చెప్పుకొచ్చాడు. మరొక సందర్భంలో 'హిందువంటే సత్యాన్ని అన్వేషించేవాడు, అందుకై ప్రాణాలర్పించే వాడి అంటూ తనకు తోచిన విధంగా మాట్లాడాడు. ఆ వ్యక్తి గత 70 సంవత్సరాలుగా భారతదేశాన్ని తన కుటుంబం గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన “ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ కి మాజీ అధ్యక్షుడు. ప్రస్తుతం ఆ పార్టీ యువజన విభాగం, విద్యార్థి యూనియన్లకు చైర్‌ వర్సన్‌గా వ్యవవారిన్తున్నాడు. రాజీవ్‌, సోనియాల కుమారుడు, 50 ఏళ్లు వయసు దాటినప్పటికీ నవ యువకుడిగా పిలిపించుకుంటున్న రాహుల్‌ గాంధీ.

50 ఏళ్లు వయసు దాటినప్పటికీ నవ యువకుడిగా పిలిపించుకుంటున్న రాహుల్‌ గాంధీ.
హిందుత్వ వ్యతిరేకి రాహుల్‌ గాంధీ
స్వాతంత్య్ర పోరాట సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ గారితో ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా, ఆయన ఇంటి పేరును కూడా తగిలించుకొని దేశంలో చలామణి అవుతున్న మూడోతరం వ్యక్తి ఇతడు. ఈయన గతంలో ఎప్పుడూ దీపావళి, దసరా వంటి పండుగలు, చివరికి అన్నావెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్‌ రోజున తన సోదరి ప్రియాంక వాద్రా రాఖీ కడుతుండగా ఏనాడూ పండుగ జరుపుకోలేదు. ఇతడు గానీ ఇతని కుటుంబ సభ్యులు గానీ హిందువుల పండుగలు, పూజల సమయాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, బంధువులు, మిత్రులు వంటి ఎవరి ఇళ్లలోకి కూడా వెళ్ళరు. కానీ ఎన్నికల సమయంలో ధోవతి ధరించి చొక్కాపై జంధ్యం వేసుకొని ప్రదర్శిస్తూ ఆలయంలోకి వెళ్లి పూజలు చేస్తాడు. అక్కడితో ఆగకుండా నేను గౌడియ 'బ్రాహ్మణుడనని, దత్తాత్రేయ గోత్రానికి చెందిన వాడననీ ( ఈ గోత్రం దేశంలోఎవరికీ లేదని తెలిసింది ) ప్రకటిస్తుంటాడు. కానీ తండ్రివైపు తాత పరంగానా లేదా తల్లి వెపు నుండా ఎవరి వారసత్వంగా బ్రాహ్మణుడయ్యాడో చెప్పలేదు.
గతంలో హిందువులు ఆడవాళ్లను చూడడానికే ఆలయాలకు వెళ్తారని అసంబద్ధమైన ఆరోపణలను హిందువుల మనోభావాలు దెబ్బతినేట్టుగా గుప్పించిన వ్యక్తి కూడా ఇతనే.
ఇటీవల గడిచిన డిసెంబర్‌ 12వ తేదీన రాజస్థాన్‌లో జరిగిన ఒక సభలో వేదికపైన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలి సమక్షంలో మాజీ కాంగ్రైన్‌ పార్టీ అధ్యక్షుడుగా తమకాంగ్రెన్‌ పార్టీ వైఖరి కుండబద్దలు కొట్టినట్లుగా తెలియజేశాడు. “హిందువులు వేరని, హిందుత్వం వేరని ప్రకటించాడు”. హిందువుల నుండి హిందుత్వాన్ని వేరు చేయాలనే భయంకరమైన కుట్రకు కాంగ్రెస్‌ పార్టీ మరోసారి పాల్పడింది.
హెందుత్వం - హిందువుల నిర్మూలనే లక్ష్యంగా పని చేసిన-చేస్తున్న పార్తీ - A Political party working towards annihilation to Hindutva - Hindus
Anti-Hindu Nehru 
కాంగ్రెస్‌ పార్టీకి హిందుత్వం గురించి, హిందువుల గురించి, హిందువుల నమ్మకాల గరించి, హిందువుల చరిత్రగురించి తమకు అవసరం వచ్చినప్పుడల్లా అవసరాని తగ్గట్టుగా వ్యాఖ్యానిస్తూ, కార్యక్రమాలను రచిస్తూ, చట్టాలనుచేస్తూ కొన్నిసార్లు చట్టాలను మారుస్తూ, హిందువులను హిందువులుగా బ్రతకనీయకుండా, వారి ఏ విధమైన మేలు చేయకపోగా, హిందువుగా ఉండడం కంటే ఇతర మతంలోకి మారడమే మేలని అనుకునేట్లుగా చేసి, పలువిధాలుగా మభ్యపెట్టి మాయచేసి, తద్వారా తమ స్వార్థం నెరవేర్చుకున్సి తమ పబ్బం గడుపుకుని రాజ్యాధికారంలో కొనసాగడం అలవాటు.
    స్వాతంత్య్ర పోరాట సమయంలో మతం ప్రాతిపదికన దేశ విభజన జరిగి పాకిస్థాన్‌లో ఉన్న హిందువులను అక్కడి ఇస్లాం మతస్థులు ఊచకోత కోసి హత్యలు చేస్తూ, ఆస్తులు స్వాధీనం చేసుకొని హింసలు పెడుతుండగా, లక్షలాది మంది, స్వదేశంలోనే కాందిశీకులై పొట్ట చేతపట్టుకొని విభజించబడిన తమ భారతదేశానికే తరలివచ్చారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలోని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఆ పార్టీ సభ్యులు భారత భూభాగం లోకి వచ్చిన హిందువులకు కనీసం ఉండటానికి వసతిగాన్సీ భోజనాలుగాన్నీ నిలదొక్కుకోవడానికి ఉపాధిగానీ కనీసం భారతదేశ పౌరసత్వం గానీ ఇవ్వడానికి నిరాకరించింది. చివరికి ఖాలీగా ఉన్న ప్రభుత్వ భవనాలలో, ఆలయాలలో, మసీదులలో తలదాచుకుంటే కూడా కనికరం లేని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు ఖాళీ చేయించి హిందువులను రోడ్డున పడవేశాయి.

మాకు వేరే దేశం కావాలని, అది కూడా ఇస్లామిక్‌ మత రాజ్యమైన పాకిస్తాన్‌ దేశం కావాలని డిమాంద్‌ చేస్తూ రోడ్లపైకి వచ్చినవారు హిందువుల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తి కలకత్తా వంటి నగరాలలో వేలాది మంది హిందువుల హత్యలక్షు పాల్పడ్డారు. అయితే వారి కోరిక ప్రకారం వాళ్లు కోరుకున్న పాకిస్థాన్‌కు వెళ్లనూలేదు, వాళ్లు తమకే ఓట్లు వేస్తారనే కక్కుర్తితో వారిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌కు పంపించనూలేదు, సరికదా మత దురహంకారంతో తూర్పు బెంగాల్‌ ప్రస్తుత బంగ్లాదేశ్ పంజాబ్‌, సింధు వంటి ప్రాంతాల్లో స్థానికులైన హిందూ ప్రజలను తరిమివేస్తుంటే, అంబేద్మర్‌ లోగడ చెప్పిన 'జనాభా మార్చిడి” జరగాలనే విషయాన్ని పట్టించుకోలేదు. హిందువులు ప్రాణాలు కోల్పోతుంటే అధికారంలో ఉన్న 'కాంగ్రెస్‌ పార్టీ 'చూస్తూ ఉంది" తప్ప చర్యలేవీ తీసుకోలేదు. హంతకులను బంధించలేదు, వారిపై కేసులు నమోదు చేయలేదు, చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించనూ లేదు. కనీసం పాకిస్థాన్‌లోని వారి ఆస్తులను, వస్తువులను కూడా తెప్పించనూలేదు. భారత్‌ వచ్చిన హిందువుల స్థిర చరాస్తులను మాత్రం పాకిస్థాన్‌ ప్రభుత్వం శత్రువుల ఆస్తులుగా ప్రకటించేసి హస్తగతం చేసుకుంది. కానీ ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌ వెళ్ళిపోయిన వారి ఆస్తులకు కొన్నిచోట్ల వివిధ రకాలుగా పరిహారం ఇచ్చింది, అమ్మకోవడానికి అవకాశం ఇచ్చింది. నిజాం నవాబుతో సహా ఎందరో దోపిడీదారులు, ప్రజలు చెల్లించిన శిస్తులతో నిండిన ఖజానాలను, ఆస్తులను తరలించుకుపోతుంటే సహకరించింది.

హిందువులను హిందుత్వం నుండి దూరం చేయాలనే  కుట్రతో తమ ధార్మికమైన మతపరమైన విషయాలను బోధించడానికి వీలులేదని, కనీసం దేశ చరిత్రలైన వేదాలు, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి వాటిని కూడా నేర్చుకొనకుండా, వాటిని బోధించే గురుకులాలను, సంస్కృత పాఠశాలలను మూసివేయించిన ఘనత కూడా కాంగ్రెస్‌ పార్టీదే.

అదే సమయంలో క్రైస్తవులకు, ముస్లింలకు తమ మత బోధనలు చేసుకోవడానికి, నేర్పించడానికి పాఠశాలలు నెలకొల్పడానికి ఆర్టికల్‌ 30/302 ద్వారా సౌకర్యం కల్పించారు. 

అంతేకాదు, దేశంలోని గురుకులాలను, సంస్కృత విద్య బోధించే పాఠశాలలను ప్రారంభించవద్దని స్థానిక ప్రభుత్వాలను “శాసించి మరోవైపు ముస్లింల మదర్సాలకు, క్రైస్తవులకు చర్చి మాధ్యమంగా బైబిల్‌ బోధించే స్కూళ్లకు నిర్వహణ కొరకై వేతనాల రూపంలో సహాయం అందిస్తూ, ఆయా మతాలకు చెందిన విద్యార్థులకు కూడా హాస్టళ్లని, స్మాలర్చిప్‌లనీ ప్రభుత్వమే ధనసహాయం అందించేటట్లు మైనార్టీల పేరుతో చట్టం చేసింది. చదువు అనంతరం ఉపాధి కోసం కూడా అనేక రకాలుగా ప్రోత్సాహకాలు కల్పించింది. హిందూ మతాన్ని అవలంబించే వారికి లభించకుండా మోసం చేసింది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.
    స్వాతంత్ర పోరాటంలో భగత్‌ సింగ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ మహాత్మాగాంధీ లాంటి వాళ్లతో పాటు మరెందరికో స్ఫూర్తి నిచ్చిన భగవద్గీతను అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ వ్యక్తిగతంగా తమ ఇంట్లో సామూహిక భగవద్దీత పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడికెవరూ వెళ్లరాదంటూ నెహ్రూ ప్రభుత్వం శాసించడానికి కారణం ఏమై ఉంటుంది ?
     ఆక్రమణ కారుల చేతిలో విధ్వంసానికి గురి అయిన గుజరాత్‌ రాష్ట్రంలోని సోమనాథ్‌ మందిర పునర్నిర్మాణం కోసం ప్రారంభించిన ఉద్యమం స్వాతంత్య్ర సాధనకు ప్రజలను పురికొల్పింది. స్వాతంత్రానంతరం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో ఉద్యమకారులందరూ సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణానికి పూనుకొనగా, అట్టి  నిర్మాణ కార్యంలో పాల్గొనరాదంటూ కాంగ్రెస్‌... పార్టీ తరపున కార్యకర్తలకు, ప్రభుత్వం తరపున అధికారులకు ఆర్జర్లు జారీ చేయడమే కాక రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ గారిని శంకుస్థాపనకి కూడా వెళ్ళకుండా ఆపదానికి విఫల ప్రయత్నం చేసింది.
కాషాయ ధ్వజం
కాషాయ ధ్వజం
హిందుత్వానికి ప్రతీక అయిన కాషాయ ధ్వజం ఎగరడానికి ఒక్క అంగుళం స్థలం కూడా ఈ దేశంలో లభించదంటూ ప్రకటనలు గుప్పించాడు నాటి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని నడిపే జవహర్లాల్‌ నెహ్రూ. ఆ తర్వాతి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి కుంభమేళాలు, గంగా స్నానాలు కూడదంటూ, కనీసం ఆలయాలలో గట్టిగా గంటలు కూడా మైగించకూడదంటూ శాసించింది.
    ఆలయ భూములను పేదలకు పంచుతున్నామనే సాకుతో తమ కాంగ్రెస్‌ పార్టీకి కొమ్ముకాసే వారందరికీ పంచి ఆదాయం లేక ఆలయాలు మూతపడేటట్లుగా చేసింది. పూజారులు అర్చకుల పొట్టను కొట్టి, బతకడమే కష్టంగా మార్చి గుడులలో పూజలన్నీ నిలిచిపోయేటట్లుగా కుతంత్రాలు పన్నింది. చివరికి గోవులు చరించడానికై మన పూర్వీకులిచ్చిన గోమాతలకు చెందిన గోచర భూమిని కూడా వదలకుండా రాజకీయ నాయకులు పంచుకునేనేట్టుగా అవకాశం ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలే, ఈ దేశంలో హిందుత్వ నిర్మూలనకు ఇన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఆ పార్టీ నాయకులు ఇప్పుడు తాము బ్రహ్మణులమనీ, తమది బ్రాహ్మణుల పార్టీ అని ప్రచారం చేన్తుకుంటున్నారు, ప్రజలను నమ్మించడానికి నానా యాతనలూ పడుతున్నారు.
   ఒకవైవు హిందువులను ఇంతలా ఇబ్బందులక గురిచేసిన కాంగ్రెస్‌ మరోవైపు తనకు ఇష్టమైన మరో వర్గానికి అన్ని విధాలా సహకరించింది. స్వాతంత్య్రనికి పూర్వం హిందూ ప్రజల భూములను ఆక్రమించి, వాటి  చుట్టూ కట్టడాలు నిర్మిస్తే అట్టి కట్టడాలను స్వాతంత్య్రనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు 'వక్స్‌ భూములు అంటూ ప్రకటించాయి. హిందూ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేసి వసూలు చేసిన ధనాన్ని తనకు నచ్చిన వర్దానికి పంచుతూ “వక్‌ ఆస్తులు' గా పిలుస్తోంది.

హిందుత్వ వినాశనానికి కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఎన్నో చేసింది...

  • - భారతజాతి ఆత్మ గుర్తెరిగిన బాబూరాజేంద్ర ప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి దిగ్గజాలుండగా, తండ్రి మక్కాకు, తల్లి మదీనాకు చెందినవారు కాగా, 1988వ సంవత్సరంలో మక్కాలో జన్మించిన అబుల్‌ కలాం ఆజాద్‌ 1902లో భారతదేశం వచ్చాడు. 1906లో ముస్లిం లీగ్‌ ప్రారంభం చేసారు. 1947లో స్వాతంత్ర్యానంతరం భారత అతడు మొదటి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 1958 వరకు విద్యాశాఖమంత్రిగా కొనసాగారు. ఈయనకు భారతదేశానికి సంబంధించిన ఎలాంటి చదువుల పరిజ్ఞానం కానీ లేదు. కనీసం కళాశాల చదువు కూదా ఇక్కడ చదవలేదు. ఎక్కడో మక్కాలోని మదర్సాలలో చదివిన అబుల్‌కలాంను భారతదేశ విద్యామంత్రిగా నియుక్తి చేయడం, ఆయనను 11 సంవత్సరాలు కొనసాగించడం, తదుపరి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ను, అనంతరం ఇలాంటి వారినే విద్యామంత్రులుగా నియమించి హిందువుల విద్యా విధానాలను బ్రష్థు పట్టించడం కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పూరితంగా చేసిన భయంకరమైన తప్పిదం.
  • - దేశ స్వాతంత్ర్యానంతరం అయోధ్యలో రామజన్మ భూమి మందిరం నిర్మాణం జరగాలని పెద్దఎత్తున ఉద్యమం కొనసాగుతుండగా కేసులోని ఆధారాలను పరిశీలించిన ఫైజాబాద్‌ జడ్జి జన్మభూమి స్థలంలో గతంలో మందిరం ఉండేదని, దానిని కూల్చివేసి గుమ్మటాలు కట్టారని, ప్రజలు కోరుకుంటున్నట్లుగా నమాజులు జరగని ఆ మందిరంలో పూజలు జరగాలని, పూజారిని నియమించాలని అతనికి నెలవారి వేతనం ఫైజాబాద్‌ మున్సిపల్‌ వారు ఇవ్వాలని, తీర్చు చెప్పిన జడ్జి నాయర్‌ గారిని పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. అంతేకాదు అప్పటి ఫైజాబాద్‌ నగర కమిషనర్‌ను కూడా మార్చివేశారు, నగర మునిసిపల్‌ పాలనా యంత్రాంగాన్ని బర్తరఫ్‌ చేశారు. ఆశ్చర్యంగా ఇదే కాంగ్రెస్‌ పార్టీ రాజీవ్‌ గాంధీ హయాంలో అయోధ్య నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. అప్పుడు ఏం చెప్పుకున్నారంటే, అయోధ్యలో  (శ్రీ రామజన్మ భూమి మందిరానికి శిలాన్యాసం జరగడానికి మా హయాం లోనే కోర్టు నుండి అనుమతి వచ్చిందని బహిరంగంగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు పట్టుకొన్న సమయంలో శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణం కోసం సాధువుల మార్గ దర్శక మండలి మరియు విశ్వహిందూ పరిషత్‌ను కాదని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన తాంత్రికస్వామిగా ప్రసిద్ధులైన చంద్రస్వామి నేతృత్వంలో సాధువుల సమితిని, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ పీవీఆర్కే ప్రసాద్‌ మరియు బీహార్‌కు చెందిన కునాల్‌ కిషోర్‌ ప్రసాద్‌ అనే ఐపీఎస్‌ అధికారిని ముందుంచి మరొక “శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణ సమితిని సృష్టించి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోనే 'శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణం” అంటూ. బుకా యించడం మొదలుపెట్టారు. స్వామీజీలలో, హిందూ సంస్థలలో చీలికను తెచ్చే ప్రయత్నాలకు నిస్సిగ్గుగా పాల్పడ్డారు.
  • - ఇక సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఉండగా మళ్లీ ప్లేటు ఫిరాయించి శ్రీరాముడు పుట్టనేలేదని, అతని పుట్టుక ఊహాజనితమైనదని సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.
  • - స్వామి అసిమానంద, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ వంటి ఏ పావమూ ఎరుగని వారిని బంధించి హిందువులను తీవ్రవాదులుగా చూపించే కుట్రకు పాల్పడింది కాంగ్రెస్‌ పార్టీ. 'హిందూ తీవ్రవాదం! అంటూ కొత్త శబ్దాన్ని సృష్టించి హిందువులను తీవ్రవాదులుగా చూవించే కుట్రకు తెగబడ్డారు.
  • - భారతదేశంలో క్రైస్తవులైనా, మహమ్మదీయులైనా, వారందరి పూర్వీకులు హిందువులే. అనగా హిందూ ధర్మం నుండే మతం మార్చబడినవారు. కారణాలు ఏవైనా ఉండవచ్చు. గాక కానీ ఇది చరిత్ర. 
అటువంటిది క్రైస్తవంలో మరియు ఇస్లాంలో ఇమడలేక తమ మాతృధర్మం అయిన హిందుత్వంలోకి వస్తే దానిని మతంమార్చిడి అంటూ ప్రకటించి, స్వధర్శంలోకి వచ్చిన హిందువులపై కేసులు నమోదు చేయాలని చూశారు. హిందువులను మరింతగా ఇబ్బందులపాలు చేయడం కోసం చట్టం తేవడానికి రంగం తయారు చేసుకున్నది సోనియా హయాంలో కాంగ్రెస్‌ పార్టీ. క్రైస్తవులు గాని ముస్లిములుగాని 'మతంమార్చిడిలకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తే జైలుశిక్ష విధించే చట్టం చేయాలని ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌ పార్టీ “అదృష్టవశాత్తూ” 2014లో ఓడిపోయిన కారణంగా హిందువులు బతికిపోయారు.

ఇలా ఎన్నో విధాలుగా హిందువుల నుండి హిందుత్వాన్ని దూరం చేయాలని ప్రయత్నించింది కాంగ్రెస్‌. అటువంటి కాంగ్రెస్‌ నేడు నిస్సిగ్గుగా తమది హిందువుల పార్టీ అని చెప్పుకోవడానికి ప్రయత్నించడం విడ్డూరం కదా! భారత  ప్రజలు ఇప్పటికీ తన కుట్రలను అర్ధం చేసుకోలేరు అని ఆ పార్టీ భ్రమిస్తున్నదేమో ! కానీ ఇప్పుడు భారతీయులు తమకు నిజంగా ఏం కావాలో స్పష్టం తెలుసుకున్నారనీ, దానికోసమే తమ అడుగులను జాగ్రత్తగా వేస్తున్నారనే విషయాన్ని కాంగ్రెస్‌ గమనించాలి. విశ్వహిందూ మాసపత్రిక సౌజన్యంతో...

విశ్వహిందూ మాసపత్రిక: చందాదారులుగా చేరేందుకు..
  • జీవితసభ్యత్వం (10 సంవత్సరాలు) రూ. 1500/-
  • వారక బందా 'రూ.150/-
  • విడిఫ్రతి రూ. 15/-
డిడిలు “విశ్వహిందు” పేరున పంపాలి
బ్యాంక్‌ ఖాతా వివరాలు:
  • Punjab National Bank
  • Koti Branch, Hyderabad.
  • Ac No. 1969000100009937
  • IFSC: PUNBO196900
మరిన్ని వివరాలకు
కడవేరు గణేశ్వరం, మొబైల్ - 9080189670

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top