పీఓకే విషయంలో భారత్ మరోసారి తన వైఖరిని తేల్చి చెప్పింది. పొరుగు దేశంతో చర్చించాల్సిన ఏకైక విషయం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకె) తిరిగి అప్పగించే విషయంపై మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో తమకు చాలా స్పష్టమైన వైఖరి వుందని, పీఓకే తిరిగి రావడం అన్న అంశమే మిగిలిపోయి వుందని మోదీ అన్నారు.
పొరుగు దేశంతో ఇక మాట్లాడాల్సిందేమీ లేదన్నారు. అలాగే పీఓకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరమే లేదని మోదీ తేల్చి చెప్పారు. పాక్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాక్ డీజీఎంవోకి సమాచారం ఇచ్చామని, చర్చలకు సిద్ధంగా వున్నట్లు కూడా చెప్పామన్నారు. కానీ.. పాక్ నుంచే ఎలాంటి స్పందనా రాలేదని మోదీ తెలిపారు.