![]() |
| Dharma is the universal set of values that unites society : Krishna Gopal |
అలహాబాద్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో IIIT అలహాబాద్ ఆడిటోరియంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సంస్థ డైరెక్టర్ ముకుల్ శరద్ సుటావోనే అధ్యక్షత వహించగా, ముఖ్య వక్తగా ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ డా. కృష్ణ గోపాల్ హాజరయ్యారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నదమ్ముడు-అక్కాచెల్లెళ్ల అనుబంధానికే పరిమితం కాదని, బలహీనులకు మరియు బలవంతులకు మధ్య రక్షణ మరియు భద్రతకు సంబంధించిన పండుగగా ఇది విస్తరించిందని ముకుల్ శరద్ సుతవనే గారు పేర్కొన్నారు.
ఇక.. డా. కృష్ణగోపాల్ మాట్లాడుతూ రక్షా బంధన్ ఆవశ్యకత, ఎలా ప్రారంభమైంది? సామాజిక ఉద్యమంగా ఎలా రూపాంతరం చెందిందో విస్తారంగా వివరించారు. చరిత్రలో కీలకమైన సామాజిక ఉద్యమాల సమయంలో, గంగానదీ తీరంలో ప్రజలు ఒకరికొకరు 'రక్షా సూత్రం' కట్టుకోవడం ద్వారా ఐక్యత, అంకితభావంతో ఉంటామని ప్రతిజ్ఞ చేసేవారని గుర్తు చేశారు.ధర్మం అనేది ఏ ఒక్క వ్యక్తి ద్వారా ప్రారంభించబడినది కాదు; సమాజాన్ని ఏకం చేసే విశ్వవ్యాప్త విలువల సమాహారమే ధర్మం.’’ అని తెలిపారు.
ధ్వజం ధర్మానికి ప్రతీక అని, కాషాయ రంగు ధ్వజానికి రక్ష కట్టడం ద్వారా మనం ధర్మాన్ని రక్షించుకుంటామన్న ప్రతిజ్ఞ చేసినట్లు అవుతుందని, ధర్మాన్ని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుందన్న సూత్రం భారతీయ ధర్మంలో వుందన్నారు. భారతదేశం అనేక భాషలు, మతాలు మరియు సంస్కృతులు కలిగిన దేశమని, ఈ వైవిధ్యాన్ని ఏకం చేసే అంశం మతమేనని ఆయన పేర్కొన్నారు. విదేశీ దాడులు మరియు దేశ విభజన సామాజిక విచ్ఛిన్నానికి దారితీసినప్పటికీ, అటువంటి విచ్ఛిన్నకర శక్తుల మధ్య సమాజంలో ఐక్యతను మరియు సోదరభావాన్ని పెంపొందించడానికి 'సంఘ్' కృషి చేస్తోందన్నారు.
సంఘ్ రక్షా బంధన్ను సాంప్రదాయ సోదర-సోదరీ సంబంధానికి అతీతంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి, దానిని అణగారిన, అటవీ ప్రాంతాలలో నివసించే వర్గాల పట్ల బంధుత్వం మరియు రక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞగా మార్చిందన్నారు. మరోవైపు భౌతిక సంపదతో పాటు మానసిక దారిద్ర్యం కూడా నేడు సమాజంలో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ సంస్కృతి మరియు ఒంటరితనం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, సమాజ పవిత్రతను కాపాడేందుకు పరస్పర ఆప్యాయత మరియు సామాజిక అనుబంధాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.


