రాణి అబ్బాక్కా దేవి - భారతదేశ మొదటి స్వాతంత్య్ర పోరాట యోధురాలు - Tuluva RANI ABBAKKA DEVI

0
Tuluva RANI ABBAKKA DEVI
Tuluva RANI ABBAKKA DEVI

మహారాణి అబ్బక్క

అది 1555 సంవత్సరం పోర్చుగీస్ వాళ్ళు వలసరాజ్యాల స్థాపనలో తిరుగులేకుండా ఉన్నారు. మనదేశంలోని కాలికట్ వశపరుచుకొని జామోరిన్స్ను నాశనం చేశారు. బీజాపూర్ సుల్తాన్ను ఓడించారు.గుజరాత్ సుల్తాన్ని ఓడించి డామన్ ను తీసుకొని, మైలాపూర్ లో ఒక కాలనీని స్థాపించారు, బొంబాయిని స్వాధీనం చేసుకున్నారు మరియు గోవాను వారి ప్రధాన కార్యాలయంగా మార్చారు. గోవలో చర్చిని నిర్మించడానికి పురాతన కపలీశ్వర ఆలయాన్ని కూడా నాశనం చేశారు. వారి తదుపరి లక్ష్యం, మంగుళూరులో ఉన్న ఓడరేవు.
30 ఏళ్ల యువతి రాణి అబ్బక్క చౌతా
30 ఏళ్ల యువతి రాణి అబ్బక్క చౌతా
మంగుళూరుకు దక్షిణాన కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉల్లాల్ అనే చిన్న సంస్థానం దాన్ని పారిపాలించేది 30 ఏళ్ల యువతి రాణి అబ్బక్క చౌతా. మొదటిలో పోర్చుగీస్ వాళ్ళు రాణి అబ్బక్కని తేలికగా తీసుకొని, ఆమె సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని వారిలో కలుపుకోవాలని అలాగే ఆమెని బంధించి గోవాకు తీసుకురావడానికి కొన్ని పడవలు మరియు సైనికులను పంపారు - ఆ పడవలు తిరిగి రాలేదు.
  వారికి ఏమి జరిగిందో అర్ధంకాలేదు ఇప్పటి వరకు వారు దాడి చేసిన ప్రతి రాజ్యం వాళ్ళకి దాసోహం అన్నవి కానీ మొదటిసారి పరాజయం అందులోని స్త్రీ చేతిలో , ఈసారి కోపంతో భారీ నౌకలను పంపారు, చాలా ప్రసిద్ధ అడ్మిరల్ డోమ్ అల్వారో డా సిల్వీరా నాయకత్వంలో అడ్మిరల్ త్వరలోనే గోవా తిరిగి వచ్చాడు, తీవ్రంగా గాయపడ్డాడు మరియు ఖాళీ చేతులతో ఓడిపోయి ఆ తరువాత, మరొక పోర్చుగీస్ నౌకాదళం పంపబడింది - అనేక పోర్చుగీస్ సైనికులు ఆచూకీ లేదు...కొద్దిమంది మాత్రమే గాయాలతో వెనుకకు వచ్చారు.
  ఇంకా పోర్చుగీస్ వాళ్ళు ముందుగా మంగళూరుని ఆక్రమించుకొని అక్కడనుండి రాణి అబ్బక్క మీద యుద్ధం చెయ్యాలని ప్రణాళిక వేసుకున్నారు. పోర్చుగీస్ జనరల్ జోనో పీక్సోటో ఆధ్వర్యంలో భారీ సైన్యం మంగుళూరును విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.
  తరువాత ఆ అనుభవజ్ఞుడు అయిన పోర్చుగీస్ జనరల్ ఉల్లాల్‌కు పంపబడ్డాడు. అతని ఉద్దేశం ఉల్లాల్‌ను లొంగదీసుకుని, అబ్బాక్కా చౌతాను బంధించడం. పోర్చుగీసువారు ఉల్లాల్‌కు చేరుకున్నారు అది నిర్జనమైపోయి ఖాళీగా కనబడింది..వారు ఊరు మొత్తం వెతికారు రాణి అబ్బాక్క ఎక్కడా కనిపించలేదు.
రాణి అబ్బక్క
రాణి అబ్బక్క
సైన్యం కానీ రాణి అబ్బక్క కనిపించపోవటంతో విశ్రాంతి తీసుకున్నారు ......ఇంకా మేమే గెలిచాము రాజ్యం సొంతం అయింది అని అనుకుంటునంతలో రాణి అబ్బక్క చౌతా ఆమె ఎంచుకున్న 200 మంది సైనికులతో దాడి చేసింది - ఒక్కసారిగా మీదపడటంతో ఊహించని పరిణామానికి పోర్చుగీసువారు పోరాటం చెయ్యకుండానే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో జనరల్ జోనో పీక్సోటో చనిపోయాడు,70 మంది.పోర్చుగీస్ సైనికులు బందీలుగా పట్టుబడ్డారు.
   రాణి అబ్బాక్కా చౌతా పెద్ద ఎత్తున దురాక్రమణదారులను ఓడించి, ఒక జనరల్‌ను చంపి, యోధులను బంధించి, ఆమె రాజ్యాన్ని రక్షించుకున్నారు.... చాలు నా రాజ్యాన్ని కాపాడుకున్న అని విశ్రాంతి తీసుకోలేదు రాణి అబ్బాక్కా చౌతా, అదే రాత్రి తన మనుష్యులతో కలిసి మంగుళూరు వైపు ప్రయాణించి, మంగుళూరు కోటను ముట్టడించింది - తెలివిని ఉపయోగించి పోర్చుగీస్ జనరల్ లలో ముఖ్యమైన శక్తివంతమైన చీఫ్ అడ్మిరల్ మస్కారెన్హాస్ను హత్య చేసి, పోర్చుగీస్ సైన్యాన్ని మంగుళూరు నుండి వెళ్లేలా చేసింది.
రాణి అబ్బాక్కా చౌతా పెద్ద ఎత్తున దురాక్రమణదారులను ఓడించింది !
రాణి అబ్బాక్కా చౌతా పెద్ద ఎత్తున దురాక్రమణదారులను ఓడించింది !
ఆమె అంతటితో ఆగలేదు, మంగుళూరుకు ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందపుర వద్ద పోర్చుగీస్ స్థావరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది.
  పోర్చుగీస్ వారికి ఇంకా రాణి అబ్బక్క ని ఎదుర్కోవటం కష్టం అనిపించి, చివరకు అబ్బాక్కా చౌతా యొక్క భర్తను ప్రలోభపెట్టి ఒప్పించి, డబ్బు కోసం ద్రోహం చేయమని చెపుతారు ( ఇక్కడ ఒక్క విషయం కొన్ని కారణాల వలన రాణి అబ్బక్క తన భర్తకి విడిపెట్టి ఆమె పిల్లలతో కలిసి రాజ్యపాలన చేస్తున్నది). ఆ అమ్ముడుపోయిన భర్త ఆమెను బందించేలా పోర్చుగీస్ వాళ్ళకి సాయం చేస్తాడు, రాణి అబ్బక్క బందించబడి ఖైదు చేయబడుతుంది...అక్కడ ఆమె మళ్లీ తిరుగుబాటు చేసి తప్పించుకునే ప్రయత్నంలో చంపబడింది.
   1857 లో భారత స్వాతంత్ర్య మొదటి యుద్ధానికి 300 సంవత్సరాల ముందు అబ్బక్కా చౌతా పోర్చుగీసులకు వ్యతిరేకంగా పోరాడింది...

భారతీయులము అయిన మనం ఆమెకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలిపాము ఏ విధంగా గౌరవించం ? ఆమెను మరిచిపోయాం.
ఆమె తెలియది ఆమె పేరు మనకి తెలియదు ఇంకా మన పిల్లలకు ఎమ్ తెలియచేస్తాం....అనే సాహస కథలను పిల్లలకు ఎవ్వరు చెపుతారు.
  ఆమె పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది ప్రభుత్వం..ఆమె పేరుని ఒక షిప్ కి పెట్టి 2 విగ్రహాలను నిర్మించాము - భారతీయులు ప్రతి ఒక్కరు గొప్పగా గర్వముగా చెప్పుకోవాల్సిన ఆమె ఎవ్వరికి తెలుసు ఎక్కడో 2 విగ్రహాలు పెడితే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసిజిఎస్ రాణి అబ్బాక్కా హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించిన ఐదు ఇన్షోర్ పెట్రోలింగ్ ఓడల్లో మొదటిది అబ్బాక్కా మహాదేవి పేరు.
   ఆమె యూరోపియన్ లేదా అమెరికన్ అయి ఉంటే, మన పాఠ్య పుస్తకాలలో ఆమె గురించి ఒక అధ్యాయం చదవవలసి ఉండేది....ఆమె పేరుతో ఒక రోజు ఉండేది. ప్రపంచంలోనే ఎక్కువ గొప్ప వ్యక్తులను కలిగి ఉంది మన భారతదేశం... కానీ మనం గుర్తించడం లేదు.

__ధర్మధ్వజం {full_page}

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top