పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ప్రతిపాదన చేశారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో, “మన దీర్ఘకాలిక లక్ష్యం పాకిస్తాన్ను విచ్ఛిన్నం చేయాలని సంచలన ప్రతిపాదన చేశారు.
బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్లు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడేలా చేయాలని సూచించారు. దీంతోపాటు పశ్చిమ పంజాబ్ లేదా ‘బకిస్తాన్’ను శుత్రు లక్ష్యంగా చేసుకోవాలి” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పాకిస్తాన్లోని విభజనవాద ఉద్యమాలకు స్వామి సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు “బకిస్తాన్” అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా పశ్చిమ పంజాబ్ను వ్యంగ్యాత్మకంగా లక్ష్యంగా చేసుకున్నారు.
స్వామి ట్వీట్లో పాకిస్తాన్ను నాలుగు భాగాలుగా విభజించాలని సూచించారు. బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్, పశ్చిమ పంజాబ్. ఈ నాలుగు ప్రాంతాలలో మొదటి మూడు స్వతంత్ర దేశాలుగా ఏర్పడాలని, మిగిలిన పశ్చిమ పంజాబ్ను “బకిస్తాన్” అని సంబోధిస్తూ దానిని శత్రువుగా చూడాలని ఆయన పేర్కొన్నారు. బకిస్తాన్” అనే పదాన్ని వ్యంగ్యాత్మకంగా చెప్పారు.