భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరిట కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా భారత ఆర్మీ దాడులు చేసింది. అయితే పాకిస్థాన్ అందుకు విరుద్ధంగా భారత్ పౌరులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతూ రెచ్చగొడుతోంది. పౌరుల ఇళ్లతో పాటు దేవాలయాలపై కూడా పాక్ దాడి చేస్తోంది. పైగా తాము ప్రజలపై దాడి చేయడం లేదంటూ కహానీలు చెబుతోంది పాక్. భారత రక్షణ శాఖ విడుదల చేసిన కొన్ని వీడియోలే ప్రజల ఇళ్లు, ఆలయాలపై పాక్ దాడికి సాక్షాలుగా నిలిచాయి.
పాకిస్థాన్ అటాక్లో జమ్మూకశ్మీర్లోని శంభు ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నది. అలాగే నివాసాలు, ఆలయంపై పాక్ నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను రక్షణ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసింది. వీటిని చూస్తే పాక్ వంకర బుద్ధి అర్థమవుతోంది. తాము పౌరులపై దాడి చేయడం లేదన్న పాక్ వ్యాఖ్యలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి ఈ ఫోటోలు, వీడియోలు.
జమ్మూలోని ప్రసిద్ధి శంభు ఆలయం, నివాస ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు తెగబడిందని.. భారత్ ఆర్మీ వాటిని ఎదుర్కుందని రక్షణ శాఖ పేర్కొంది. రాత్రి సమయాల్లో డ్రోన్లతో ప్రజల నివాస స్థాలాలు, మతపరమైన ప్రదేశాలలో పాక్ దాడులు చేసిందని తెలిపింది. వారి ప్రయత్నాన్ని భారత ఆర్మీ ఎదుర్కుందని.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఇండిన్ ఆర్మీ కట్టుబడి ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రక్షణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్ దాడుల్లో పాక్షికంగా దెబ్బతిన్న శంభు ఆలయాన్నీ సీఎం ఒమర్ అబ్దుల్లా పరిశీలించారు.