భారత సాయుధ దళాల శక్తి “రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంకు తెలిసిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
భారత సాయుధ బలగాల సత్తా సరిహద్దులకే పరిమితం కాలేదని, పాక్ సైని ప్రధాన కేంద్రమున్న రావల్పిండిలోని గర్జించిందని చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవంలో సింగ్ వర్చువల్గా మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడంలో భారత దేశానికి ఉన్న దృఢ సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని చెప్పారు.
పాకిస్థాన్ తో ఉద్రిక్తతల వేళ భారతసైన్యం ధైర్య సాహసాలతోపాటు సంయమనాన్ని ప్రదర్శించిందని, పాకిస్థాన్లోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేసి పహల్గాం ఉగ్రదాడికి ధీటైన సమాధానం ఇచ్చిందని ఆయన కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత్కు ఉన్న రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రాజ్నాథ్ చెప్పారు.
భారత సైన్యం ఎప్పుడూ పాకిస్థాన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, కానీ పాకిస్థాన్ మాత్రం భారతదేశంలోని పౌర ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుందని ఆయన విమర్శించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ సత్తా ఏమిటో చూపించామని, ఉగ్రవాదులు, వారి మాస్టర్లు సరహద్దులు వెంబడి ఉన్నా వెంటాడి వేటాడతామని నిరూపించామని చెప్పారు. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందని చెప్పారు.”ఇది నయాభారత్…ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించబోమని ఆపరేషన్ సిందూర్తో చాటిచెప్పాం” అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.