![]() |
| Rama Navami Shobhauyatra 4,000 Rallies with 20 Million Hindus. |
శ్రీరామ నవమి సందర్భంగా బెంగాల్ అంతటా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రామ నవమికి 4 వేలకి పైగా ఊరేగింపులకు పైగానే చేసేందుకు రెడీ అవుతున్నారు. గత యేడాదితో పోలిస్తే 1,000 ఊరేగింపులు ఈ సారి ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు.రామ నవమి 26,27 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బెంగాల్ వ్యాప్తంగా ఊరేగింపులు, పూజలు చేయనున్నారు.
హిందూ సంఘాల నేతలు ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర బెంగాల్, మధ్య బెంగాల్, దక్షిణ బెంగాల్.. ఇలా మూడు భాగాలుగా విభజించి, ఊరేగింపులు చేసేందుకు యోజన చేస్తున్నారు.
పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా శ్రీ రామనవమి వేడుకల్లో హిందువులందరూ పాల్గొనేలా హిందూ సంఘాల నేతలు ప్లాన్ చేశారు. సుమారు 2 కోట్ల మంది హిందువులు ఈ ఊరేగింపుల్లో పాల్గొనేలా యోజన చేశారు. ఇప్పటికే ప్రతి చోటా ‘‘రామ నవమి ఉద్యాపన కమిటీ’’ లను ఏర్పాటు చేశారు. ఇందులో హిందూ సంఘాల నేతలందరూ పాల్గొన్నారు.
గత యేడాది 3,200 ఊరేగింపులు జరిగాయి. ఉత్తర బెంగాల్ లో 925 ప్రదేశాలు రామ నవమి వేడుకలు జరిగాయని, సుమారు 23 లక్షల మంది పాల్గొన్నారు. అలాగే మధ్య బెంగాల్ లో 1,150 ప్రదేశాలలో కార్యక్రమాలు నిర్వహించగా సుమారు 9.5 లక్షల మంది ఇందులో పాల్గొన్నారు. దక్షిణ బెంగాల్ లో మొత్తం 1,575 కార్యక్రమాలు నిర్వహించగా సుమారు 14 లక్షల మంది ప్రజలు వీటిలో పాల్గొన్నారు.
"ఊరేగింపులు, రామ పూజలతో కలిపి మొత్తం కార్యక్రమాల సంఖ్య ఈ ఏడాది 4,000 దాటుతుందని మేము ఆశిస్తున్నాము. వేడుకలు పూర్తయ్యాక, పాల్గొన్నవారి సంఖ్యను లెక్కిస్తాం’’ అని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి.

