ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు? - Khilafat movement

Vishwa Bhaarath
ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు? - Khilafat movement
ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు? - Khilafat movement

–డా. శ్రీరంగ గోడ్బోలే
ఖిలాఫత్ ఉద్యమానికి కర్తలు ఎవరు? ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని వాళ్ళు ఎక్కడ అందిపుచ్చుకున్నారు?  వాళ్ళ వేరువేరు మార్గాలు చివరికి ఒకే లక్ష్యం వైపుగా ఎలా సాగాయి?  మొదటి ప్రపంచ యుద్ధం నుండి  ఖిలాఫత్ ఉద్యమం వరకు జరిగిన సంఘటనల్లో ప్రధాన పాత్ర పోషించినవారి ఆలోచనలు ఏమిటన్నది తెలుసుకోవడం చాలా అవసరం.

అలీఘర్ ఉద్యమం:
1857 తిరుగుబాటుకు ముస్లింలే ప్రధాన కారణమని బ్రిటిష్ వారు భావించారు. ఎందుకంటే దేశంలో ఇస్లాం పాలన అంతం కావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. హిందువులను వాళ్ళు పాలితులుగానే చూశారు తప్ప తోటి పౌరులుగా స్నేహభావంతో చూడలేకపోయారు. ఈ అసంతృప్తి, నిరాశ నుంచి ముస్లిం ఐక్యత అవసరం పుట్టుకువచ్చింది. ఆ ముస్లిం ఐక్యత కోసం ఆలీఘర్ ఉద్యమం ప్రారంభమయింది.
     ఈస్ట్ ఇండియా కంపెనీకి విశ్వాసపాత్రుడైన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (1817- 1898 ) దీనికి సూత్రధారి. ఇతను 1878 నుండి 1883 వరకు  గవర్నర్ జనరల్   లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా.  సయ్యద్ దృష్టిలో ముస్లింల సాధికారత అనేది  బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండటం, ఇస్లామిక్ విద్యను వ్యాప్తి చేయడం, రాజకీయాలకు దూరంగా ఉండటం ద్వారానే సాధ్యపడుతుందని భావించేవాడు.  మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ను ఈ ఉద్దేశ్యం తోనే 1875 లో స్థాపించాడు. లాహోర్ లో జరిగిన ఒక ఇస్లామిక్  విద్యారంగ సమావేశంలో మాట్లాడుతూ, ” ఇస్లాంను ఆచరించాలి. మన ఇళ్ళలో యువత ఇంగ్లీష్ చదువుతో పాటు మన మతపరమైన సందేశాలను, చరిత్రను తెలుసుకోవాలి, వారికి ఇస్లాం విధానంలో ప్రధానమైన విషయాలు, అరబిక్, పెర్షియన్ భాషలతో పరిచయం ఉండాలి. ముస్లింలు అందరిలో పరస్పర అన్యోన్యత ఉండటం కోసం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అందరూ కలసి ఉండటం, భోజనం చేయటం, చదువుకోవడం చేయాలి…ఇవి లేకపోతే మనం ఒక జాతిగా నిలబడలేము” అని అన్నాడు.(Syed Ahmad Khan and Muslim Nationalism in India, Sharig Al Mujahid, Islamic Studies, Vol. 38, No.1, 1999, P.90)
    1867 లో బెనారస్ కమిషనర్ షేక్స్పియర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హిందూ ముస్లిం లను రెండు వేరు వేరు దేశాలుగా సయ్యద్ పేర్కొన్నాడు. 1883 లో ఇచ్చిన మరో ఉపన్యాసం లో మాట్లాడుతూ ఒకవేళ బ్రిటీషువారు  భారతదేశాన్ని వదిలి వెళ్లిపోతే …మరి ఈ దేశ పాలకులు ఎవరు అవుతారు?  హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకే సింహాసనం మీద కూర్చుని సమానమైన అధికారాలతో రాజ్యం చేయడం ఎలా సాధ్యపడుతుంది? అది సాధ్యం కాదు. వారిలో ఎవరో ఒకరు మరొకరిని జయించి సింహాసనం అధిష్టించవలసిందే’’ అని స్పష్టం చేశారు. (The Making of Pakistan, Richard Symonds, Faber, 1950, P. 31).
     1906 లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వ్యవస్థాపక సూత్రాలలో ‘బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండటం’ అనే అలీఘర్ విధానాన్ని కూడా చేర్చారు. అయితే సయ్యద్ కి ఉన్న, అలీ ఘర్ స్నేహితులతో సహా, చాలా మంది ఈ బ్రిటిష్ అనుకూలతను అంగీకరించలేదు. 1888 లో దేవబందీలు సయ్యద్ కు వ్యతిరేకంగా ఒక ఫత్వా జారీ చేశారు.
       శిబ్లి నూమానీ అనే అలీఘర్ కళాశాల మాజీ ఉపాధ్యాయుడు లక్నోలో 1894 లో నద్వత్ – ఉల్ – ఉలామా (పండితుల సభ) పేరుతో ఒక ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు.1911 లో జరిగిన బెంగాల్ విభజన లో ముస్లిం ఆధిక్యత ఉన్న అస్సాం, తూర్పు బెంగాల్ లు  నష్ట పోయాయి.  దీనితో  బ్రిటిష్ వారిపట్ల విధేయత అనే విధానం మారిపోయింది. అలాగే 1911-13 మధ్య జరిగిన బాల్కన్ యుద్ధాల వల్ల ఒట్టమాన్ టర్క్ లు యూరోప్ లోని తమ భూభాగాలను కోల్పోవలసి వచ్చింది. అలాగే బ్రిటిష్ వారు అలీఘర్ ముస్లిమ్ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలు అన్నింటినీ తిరస్కరించడంతో అలీఘర్ బ్రిటిష్ వ్యతిరేకతతో అట్టుడికిపోయింది.  తరువాత బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు అన్నింటికీ కేంద్ర బిందువు అయింది. ప్రపంచ ఇస్లాం సిద్ధాంతానికి, భారతీయ ముస్లిం ప్రయోజనాలకు నష్టం కలుగుతోందన్న భావనే బ్రిటిష్ వ్యతిరేకతకు  కారణమైందన్నది విషయం ఇక్కడ గమనించాలి.
     ఖిలాఫత్ ఉద్యమంలో లో ప్రధాన పాత్ర పోషించిన షౌకత్ అలీ (1873-1938)  మహమ్మద్ అలీ జహౌర్(1878-1931) సోదరులు మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ పూర్వ విద్యార్తులు, తర్వాత వారే ఆ కళాశాల ట్రస్టీలు ఆ తర్వాత ఆల్ ఇండియా ముస్లిం  లీగ్ వ్యవస్థాపక సభ్యులు.  వీరిలో మహమ్మద్ అలీ ‘ కామ్రేడ్'(1911)  అనే ఆంగ్ల పత్రికను, ‘హమ్ దర్ద్’ అనే ఉర్దూ వార్తా పత్రికను ప్రారంభించగా,  షౌకత్ అలీ ‘అంజుమన్ -ఇ -ఖుద్ధామ్ -ఇ -కాబా’ ను 1913లో స్థాపించడంలో సహకరించాడు.
     ఇస్మాయిలీ ఖోజా తెగ కు  చెందిన మత గురువు ఆగాఖాన్ (1877-1957)  అలీఘర్ విశ్వవిద్యాలయ పోషకులలో  ఒకరు.  ఈయన కూడా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వ్యవస్థాపక సభ్యుడిగా 1906 -13 లో పని చేశాడు.  ఖిలాఫత్ ఉద్యమ అనుకూలుడు  అయినప్పటికీ ఈయన సహాయ నిరాకరణోద్యమాన్ని వ్యతిరేకించాడు.  అలీఘర్ కు  చెందిన మరో పూర్వ విద్యార్థి మౌలానా  హస్రత్ మోహానీ (1878-1951)  ఉర్దూ వార పత్రిక ‘ఉర్దూ ఇ ముల్లా వ్యవస్థాపక సంపాదకులు.  ఈయన 1921లో ముస్లింలీగ్ అధ్యక్షుడు మరియు ఖిలాఫత్ ఉద్యమ నాయకుడిగా పని చేశాడు.

దేవ్ బంద్ పాఠశాల:
1867 లో వాయువ్య ఉత్తర ప్రదేశ్ లోని దేవ్ బంద్ లోని ఒక మసీదులో షా వాలియుల్లా ప్రారంభించిన ఢిల్లీ మదర్సాలోని ముగ్గురు పూర్వ విద్యార్థులు, మౌలానా మహమ్మద్ ఖాసిమ్ నానోటావి (1832-1880), మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి (1826-1905), మౌలానా జుల్ఫికర్ అలీ (1819-1904)లు దార్ అల్-ఉలూమ్ (జ్ఞానపు నివాసం)ను స్థాపించారు.  పాశ్చాత్య విద్యకు ఉండే కొన్ని సంస్థాగత లక్షణాలను అవలంబిస్తూ,  సాంప్రదాయ ఇస్లామిక్ పాఠ్యాంశాలను సంస్కరించడం, ఇస్లామిక్ సామాజిక   చైతన్యాన్ని పునరుద్దరించడం  లక్ష్యంగా పెట్టుకున్నారు.  ప్రభుత్వ పోషణపై ఆధారపడకుండా, వారు అన్ని వర్గాల ముస్లింల నుండి ఆర్థిక సహాయం పొందేవారు.  అలీఘర్ వాదుల మాదిరిగానే,  కొత్తగా స్థాపించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి వీరు మొదట్లో  దూరం పాటించారు.  ముస్లింలు బ్రిటిష్ వారి నుండి రాయితీలు పొందటానికి హిందువులతో సహకరించడం సరైందేనని,  అయితే అలాంటి చర్య ఇస్లాం ప్రాథమిక సూత్రాలను మాత్రం ఉల్లంఘించకూడదని గనోహి ఫత్వా ద్వారా స్పష్టం చేశారు.  అలీఘర్ వాదుల  మాదిరిగానే, దేవబందీ  సిద్దాంతం కూడా  ఇస్లాం  ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నది,  ముస్లిం ప్రయోజనాలకు ఉపయోగపడితేనే హిందువులతో ఏ విషయంలోనైనా సహకారం అనుమతిస్తారు.
      ముగ్గురు వ్యవస్థాపకుల మరణం తరువాత, దార్ అల్-ఉలూమ్ దేవబంద్  ఎక్కువగా మౌలానా మహముద్ అల్-హసన్ (1851-1920) పై ఆధార పడింది, తరువాత రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న ఆయనకు 1920, జూన్ 8 న సెంట్రల్ ఖిలాఫత్ కమిటీ (సికెసి) ”షేక్ అల్-హింద్” బిరుదు ఇచ్చింది.
      పాశ్చాత్య విద్యావంతులైన ముస్లిం యువకులకు  ఇస్లామిక్ భావ ధోరణి లో తర్ఫీదు ఇవ్వడానికి, మౌలానా మహమూద్-అల్ హసన్  ఢిల్లీలోని ఫతేపురి మసీదులో నజరత్ అల్-మారిఫ్ అల్-ఖురానియా (ఖురాన్ పరిజ్ఞాన ప్రకాశం; 1913 లో స్థాపించబడింది)అనే ఒక ఖురాన్ పాఠశాలను ప్రారంభించారు,  అది రెండు సంవత్సరాలు కొనసాగింది. హాసన్ పూర్వ విద్యార్ధి, సిక్కు మతం నుంచి ఇస్లాం స్వీకరించిన మౌలానా ఒబైదుల్లా సింధి (1872-1944) ఈ విషయంలో ఎంతో సహాయం చేశారు.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అంతర్గత శత్రుత్వం, రాజకీయ ద్వేషాలు  కారణంగా, దేవబంద్ సంస్థ  1913 లో ఈ  ఓబైదుల్లా సింధిని  అవిశ్వాసిగా ప్రకటించి, నిషేధిస్తూ ఫత్వా జారీ చేసింది.
    నజారత్ అల్-మరీఫ్ అల్-ఖురానియా సంస్థ,  దాని పోషకులలో  ఇద్దరు అలీఘర్ ధర్మకర్తలు హకీమ్ అజ్మల్ ఖాన్ (1865-1927) మరియు డాక్టర్ ముక్తార్ అహ్మద్ అన్సారీ (1880-1936),   హకీమ్ అజ్మల్ ఖాన్ 1919 లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వ్యవస్థాపక సభ్యుడు మరియు దాని అధ్యక్షుడు. 1919-25 వరకు సికెసి ఉపాధ్యక్షుడయ్యాడు మరియు 1921 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) అధ్యక్షుడయ్యాడు. ఢిల్లీలో డాక్టర్ అన్సారీ, అజ్మల్ ఖానంద్ అలీ సోదరులతో సన్నిహితంగా ఉండేవారు.  1912-13లో, అతను రెడ్ క్రెసెంట్ మెడికల్ మిషన్‌ను టర్కీకి నడిపించాడు.  అదే సంవత్సరంలో, అతను ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సభ్యుడయ్యాడు.  1919 నుండి, అతను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరియు సికెసి రెండింటిలోనూ సభ్యుడు.  అతను 1922 గయాలో జరిగిన ఖిలాఫత్ సమావేశానికి అధ్యక్షతవహించాడు. ఆ సమయంలో మౌలానా ఒబైదుల్లా సింధీని టైమ్ పత్రికలో జర్నలిస్టులుగా ఉన్న ముహమ్మద్ అలీ, అబుల్ కలాం ఆజాద్ లకు పరిచయం చేసినది డాక్టర్ అన్సారీనే.
    మహమూద్ అల్-హసన్, సింధిలు ఇద్దరూ సిల్క్ లెటర్స్ కుట్రలో (1913-20) చిక్కుకున్నారు, ఒట్టమన్ టర్కీ, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్ ల కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవాన్ని ప్రారంభించే ప్రయత్నాల గురించి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేశారు.  మహమూద్ అల్-హసన్ మరొక దేవబంద్ సహచరుడు మౌలానా హుస్సేన్ అహ్మద్ మద్ని (1879-1957). ఇతను  హెద్జాజ్  మదీనాకు వలస వచ్చి 1902 లో ఒట్టమన్ పౌరసత్వాన్ని పొందాడు.  ప్రపంచ ఇస్లాం సాధన పథకాలలో మహమూద్ అల్-హసన్ సహ కుట్రదారుడు.  1916  అరెస్ట్ అయ్యాడు.  1917-20 వరకు బ్రిటిష్ ప్రభుత్వం ఇతనిని  మాల్టాలో నిర్బంధించింది.  తరువాత అతను మళ్ళీ ఖిలాఫత్ ఉద్యమంలో చేరాడు. అలీఘర్ లో 29 అక్టోబర్ 1920 న మహమూద్ అల్ హసన్, మౌలానా ముహమ్మద్ అలీ, హకీమ్ అజ్మల్ ఖాన్, ఎంఏ అన్సారీ తదితరులు కలసి “జామియా మిలియా ఇస్లామియా” ను (నేషనల్ ఇస్లామిక్ విశ్వవిద్యాలయం) స్థాపించారు.  బ్రిటిష్ ప్రభావం లేని ముస్లిం విశ్వవిద్యాలయంగా ఈ సంస్థ  ఉండాలనేది వారి ఆశయం.

ఫిరంగి మహల్:
ఔరంగజేబు కాలం నుండీ లక్నోలోని ఒక ప్రత్యేక ప్రాంతం ఇస్లామిక్ సిద్ధాంతాల అధ్యయనానికి కేంద్రం అయింది. అదే ఫిరంగి మహల్(ఫిరంగీలు లేదా విదేశాస్టులు నివసించే ప్రదేశం).  ముల్లా నిజాముద్దీన్  పేరు మీద మదర్సాల కోసం అభివృద్ధి చేసిన ప్రాథమిక ఇస్లాం విద్యాప్రణాళిక దారుస్- ఇ- నిజామియా  ఇక్కడే తయారయింది.  నిజాముద్దీన్ శిష్యుడైన మౌలానా అబ్దుల్ బరి (1879-1920) తన ప్రాథమిక విద్యాభ్యాసం ఈ ఫిరంగి మహల్ లో పూర్తి చేశాడు. అతనికి ఇక్కడే హుస్సేన్ ఆలీ, షరీఫ్ ఆఫ్ మక్కా తో పరిచయం అయింది.  1908లో భారత దేశానికి వచ్చే ముందే ఈయన  ఒట్టమన్ సామ్రాజ్యం  లో విస్తృతంగా పర్యటించాడు.  1911లో ఈయన రెడ్ క్రెసెంట్ మెడికల్ మిషన్ కోసం విస్తృతంగా నిధులు సేకరిస్తూ ఉండగా అలీ సోదరులు, డా. అన్సారీ లతో పరిచయం అయింది.  1912లో ఈయన ఎం.హెచ్ కిద్వాయి ద్వారా ప్రభావితుడయ్యాడు.   ‘అంజుమన్ – ఇ   -ఖు ద్ధా o – ఇ – కాబా ను 1913 లో అలీ సోదరుల సహకారంతో ఏర్పాటు చేయడంలో పాలుపంచుకుని కిద్వాయ్ ఆధ్యాత్మిక శిష్యుడిగా మారాడు. ఈ అంజుమన్  సంస్థ కాబాలు,ఇతర ముస్లిం  ప్రార్థనా స్థలాలను పరిరక్షిస్తూ, ముస్లిమేతరుల ఆక్రమణ నుండి వాటిని రక్షిస్తూ ఉంటుంది. దీనిలో ప్రముఖులైన డాక్టర్ అన్సారీ, హకీమ్ అజ్మల్  ఖాన్, మౌలానా బారీ 1919లో  ‘జమియత్ ఉల్ ఉలామా  ఇ హింద్’ ను స్థాపించారు.  1921 నుండి ఈయన   సికేసీ వ్యవస్థాపక  సభ్యుడు. ఈయన హిందువులతో  కలిసుండడం ముస్లింల ప్రయోజనాలకు హానికరం అని భావించేవాడు. ( The Khilafat Movement in India, 1919-1924, Muhammad Qureshi, dissertation submitted to University of London, 1973, p.58)
    ఉలామాలు, పాశ్చాత్య ప్రభావితులైన ముస్లిమ్  నాయకులకు మధ్య మౌలానా బారీ వారధిగా పని చేశారు. ఉలేమాలు రాజకీయ  ప్రాబల్యం సాధించి  అధికారంలో  ఉన్న వారితో చేతులు కలిపినప్పుడే మతపరమైన ఆధిక్యతను చూడగలమని నమ్మేవాడు. అలా కానప్పుడు ఇస్లాం ఆధిక్యత ఒక కలగానే మిగిలిపోతుందని  భావించాడు. (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Qureshi, dissertation submitted to University of London, 1973, p.303)

మితవాదులు:
ఇప్పటి వరకూ చూసిన వివిధ సిద్ధాంతాల  నాయకులతో పాటు, ఒకే నమూనాకు సరిపోని కొద్దిమంది నాయకులు ఉన్నారు.  అటువంటి ‘మితవాదులు’(నాన్-కన్ఫార్మిస్ట్) నాయకులకు అద్భుతమైన ఉదాహరణ మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888-1958).
     మక్కాలో అరబ్ తల్లికి  జన్మించిన అతను తన కలకత్తా ఇంటిలో, దారుస్-ఎ-నిజామియా ప్రకారంగాను, తరువాత  లక్నోలోని నద్వత్-ఉల్-ఉలామా వద్ద చదువుకున్నాడు.  సర్ సయ్యద్ అహ్మద్ రచనల ద్వారా మొదట్లో బాగా ప్రభావితమయ్యాడు.  అతను ఉర్దూ వార్తాపత్రికలు, లిసాన్-ఉస్-సాదిక్ (1904), అన్-నద్వా (1905-06), వకిల్ (1907), అల్-హిలాల్ (1912) మరియు అల్-బాలాగ్ (1913) వంటి పత్రికలను ప్రారంభించి సంపాదకుడిగా వ్యవహరించాడు.  ఆజాద్ 1913 లో ముస్లిం లీగ్‌లో చేరాడు, 1920 వరకు దాని సభ్యుడిగా కొనసాగాడు, అదే సమయంలో 1919 లో మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానితో కలిసి జామియత్-ఉల్-ఉలామా-ఇ-హింద్ (భారతదేశ ఉలామా అసోసియేషన్) ను సృష్టించడం వెనుక చోదక శక్తిగా ఉన్నాడు.  ఆజాద్ , ఖురాన్ ఆధారిత మత సంస్కరణ, ఉలామాల  రాజకీయ కార్యకలాపాలకు బలమైన ప్రతిపాదకుడు. ఆజాద్ అహంకారి.  అతను అలీ సోదరులతో ఎప్పుడూ కలవలేకపోయాడు.  అతని దృష్టిలో  షౌకత్ అలీ కి  తెలివితేటలు తక్కువగా ఉండగా, ముహమ్మద్ అలీని ప్రైవేట్ సంభాషణలో మున్షి (గుమస్తా) గా పిలిచేవాడు. 1923 లో, 35 సంవత్సరాల  పిన్న వయస్సులో, ఆజాద్  కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసి ప్రత్యేకత సాధించాడు.
      అల్-హిలాల్‌లో అత్యధిక భాగం  టర్కీ నుండి వచ్చిన వార్తలకె కేటాయించేవారు. బాల్కన్ యుద్ధాల సమయంలో, ఆజాద్ వివిధ టర్కీ నాయకుల సద్గుణాలను ప్రశంసించాడు, టర్కి రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ నిధుల కోసం నిరంతరం విజ్ఞప్తి చేశాడు. ‘ఒట్టమన్ సామ్రాజ్యంలో పరిస్థితులు’ అనే ఒక వ్యాసం రాశాడు.  ఒక సంచికలో, ఆజాద్ స్పష్టంగా ఇలా అన్నాడు, “ఒట్టమన్ ఖలీఫ్ ఇస్లాం పవిత్ర స్థలాల సంరక్షకుడు,  టర్కీకి మద్దతు ఇస్లాంకు మద్దతుతో సమానం”.
     ఆజాద్‌ హన్‌బాలికి చెందిన ఇకన్ తైమియా (1263-1328) ను తత్వవేత్త, గొప్ప హీరో గా భావించేవాడు మరియు చివరి వరకు అలాగే ఉన్నారు.  తన ప్రభావంతో, ఆజాద్ రాజకీయ జీవితంలో జిహాద్ ను, మేధో జీవితంలో ఇత్తేహాద్ ను సమర్థించాడు. (Ideological influences on Abul Kalam Azad, Qazi Jamshed, proceedings of the Indian History Congress, Vol. 71, 2010-2011, P. 665).

జమియత్-ఉల్- ఉలమా- ఇ-హింద్:
ఖిలాఫత్ ఉద్యమం నేపథ్యంలో జమియత్-ఉల్-ఉలామా-ఇ-హింద్ నవంబర్ 1919 లో స్థాపించబడింది.  ఇది వివిధ ఇస్లామిక్ ఆలోచనల,  సిద్ధాంతాలకు చెందిన ఉలామా సంస్థగా ప్రారంభమైంది, అయితే కాలక్రమేణా, ఇది దేవబంద్ ఉలామాల ఆలోచనలపై ఆధిపత్యం చెలాయించింది.  ఇప్పటికీ ఈ సంస్థను జాతీయవాద ముస్లిమ్ సంస్థగానూ, ఖిలాఫత్ ఉద్యమ అనుకూల సంస్థగా,  తరువాత కాలంలో పాకిస్తాన్ డిమాండ్ ను  వ్యతిరేకించిన ‘జాతీయవాద’ ముస్లిం సంస్థగా పరిగణిస్తారు.  సికెసి , జామియత్-ఉల్-ఉలామా-ఇ-హింద్ రెండింటిలో మౌలానా ఆజాద్  కీలక సభ్యులుగా వ్యవహరించారు.  ఈ సంస్థ రాజ్యాంగంలో  దాని లక్ష్యాలు, ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి,
  • 1. ఇస్లాం అనుచరులను రాజకీయ మరియు రాజకీయేతర విషయాలలో మతపరమైన కోణం నుండి మార్గనిర్దేశం చేయడం.
  • 2. షరియత్ ను అనుసరించి, ఇస్లాం, ఇస్లాం కేంద్రాలు (జాజిరత్-ఉల్-అరబ్, ఖిలాఫత్ స్థానం), ఇస్లామిక్ ఆచారాలు, ఇస్లామిక్ జాతీయవాదం వీటన్నిటి రక్షణ కోసం పనిచేయడం
  • 3. ముస్లింల సాధారణ మత హక్కులు, జాతీయ హక్కులను సాధించడం, రక్షించడం.
  • 4. ఉలేమాలు అందరినీ ఐక్యం చేసి ఒకే వేదికపైకి తీసుకురావడం
  • 5. ముస్లిం సమాజాన్ని నైతికంగాను, సామాజికంగాను సంస్కరించి వారి అభివృధి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం.
  • 6. షరియాత్-ఇ-ఇస్లామియా అనుమతించిన మేరకు దేశంలోని ముస్లిమేతరులతో మంచి, స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడం.
  • 7. షరియత్ లక్ష్యాల ప్రకారం దేశం, మతపు స్వేచ్ఛ కోసం పోరాడటం.
  • 8. సమాజంలోని మతపరమైన అవసరాలను తీర్చడానికి ‘మహాకిమ్ –ఐ-షరియా’ (మత న్యాయస్థానాలు) ఏర్పాటు చేయడం
  • 9. ఇస్లాంను ప్రచారం చేయడానికి, భారతదేశం, ఇతర దేశాలలోమిషనరీ కార్యకలాపాలు నిర్వహించటం
  • 10. ఇస్లాంలో చెప్పినట్లు ఇతరదేశాల ముస్లింలతో ఐక్యత, సోదర సంబంధాలను కొనసాగించడం, బలోపేతం చేయడం.
మొత్తం మీద వివిధ సంస్ధల నేపథ్యం కలిగిన నాయకులు , ఖిలాఫత్  ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ప్రధానంగా వారి వ్యక్తిగత, ఇస్లాం, ముస్లిం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పని చేశారు. వీరి అభిప్రాయంలో దేశం కంటే ఇస్లాం ప్రయోజనాలే ముఖ్య మైనవి.  భారతదేశానికి స్వేచ్ఛ లేదా స్వపరిపాలన వారు  పెద్దగా పట్టించుకోలేదు, వారికి  టర్కీ ఖలీఫా  ప్రతిష్ట ముఖ్యమైనది.  హిందువులతో కలిసి ఉండడం, సహకారం వారి  ఇస్లామిక్ లక్ష్యాలను సాధించడానికి ఒక సాధనం.
   అలీఘర్ ఉద్యమంతో సంబంధం ఉన్న బ్రిటీష్ విద్యావేత్త థియోడర్ మోరిసన్ (1863-1963) భారతదేశంలోని ముస్లింల గురించి ఇలా అన్నారు, “ వారిలోని జాతీయత ఎలాంటిదంటే ఇక్కడి ఇతర సిక్కులు, బెంగాలీలు ఇంకా ఈ భూమిని పంచుకుంటున్న ఇతర మతాలలో కలవరు., కానీ  వారి సహ-మతవాదులు, వారు ఎక్కడ దొరికినా, అది అరేబియా లేదా పర్షియాలో లేదా భారతదేశ సరిహద్దుల్లో ఉండవచ్చు, వారితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారు.’’ (Roots of Islamic Separatism in India Subcontinent, Om Prakash, Proceedings of the Indian History Congress, Vol. 64, 2003, P. 1053)
   ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్ధించిన ముస్లిం నాయకుల ధోరణిని మోరిసన్ చక్కగా వివరించారు.
ఆ కాలానికి చెందిన ఇద్దరు కథానాయకులు ఇంకా ప్రస్తావించలేదు – ఇద్దరూ తరువాత తమతమ దేశాల ‘జాతిపిత’ లుగా పిలువబడ్డారు.  వారు మహాత్మా గాంధీ మరియు ముహమ్మద్ అలీ జిన్నా.
(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు) 

NOTE: “ఖిలాఫత్ ఉద్యమ అసలు చరిత్ర”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
__విశ్వ సంవాద కేంద్రము
{full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top